Vijayawada Floods 2024 : బుడమేరు విజయవాడలో ప్రళయం సృష్టించింది. చాలా ప్రాంతాలు ఇంకా వరద గుప్పిట్లోనే అల్లాడుతున్నాయి. మరోవైపు పలు ప్రాంతాలు సోమవారం కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. నీటిమట్టం కొద్దిగా తగ్గడంతో వరద బాధితులు పెద్ద సంఖ్యలో బయటకొచ్చారు. కొందరు ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్తుండగా మరికొందరు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. మిగిలిన వారు తాగునీరు, పాలు, ఆహారం తీసుకుని తిరిగి ఇళ్లకు వెళ్లిపోతున్నారు.