Floods in Telangana 2024 : వర్షం, విలయ తాండవం. జనజీవనం అతలాకుతలం. ముంపు ప్రాంత ప్రజల జీవితాలు అస్తవ్యస్తం. ఒక్క రోజులోనే ఏళ్ల పాటి కష్టం. భారీ వర్షాలతో ఎగువ నుంచి వచ్చిన వరద. ఎంతటి విపత్కర పరిస్థితులను తీసుకొచ్చిందో ఖమ్మం, విజయవాడలో చోటుచేసుకున్న పరిణామాలే నిదర్శనం. ఉప్పొంగిన వాగులు, నదుల నీటితో కాలనీలు, చెరువులను తలపించాయి. ఇళ్లన్నీ నీట మునిగాయి. ఇలా ఇరు రాష్ట్రాల్లో వర్షం తెచ్చిన కష్టం, నష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఇలాంటి విపత్తులకు బలి కావాల్సిందేనా? వీటి నుంచి బయటపడే మార్గాలేమిటి.