నెల్లూరు జిల్లాలో కలకలం సృష్టించిన ట్రాన్స్ జెండర్ హాసినీ హత్య కేసును పోలీసులు చేధించారు. ట్రాన్స్జెండర్ల నాయకులు హాసిని, అలేఖ్యల మధ్య ఆధిపత్య పోరే 7హాసిని హత్యకు కారణమని జిల్లా S.P కృష్ణకాంత్ వెల్లడించారు. హత్య కేసులో 12 మందిని అరెస్ట్ చేశామన్నారు. ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. హత్యకు గురైన హాసిని కారు డ్రైవర్ పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.