Chandrababu Visit Indrakeeladri : దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ఈ ఏడాది అన్నింటా శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. తీర్థ ప్రసాదాలను అందించారు.