APMDC Funding for YSRCP Govt Resurvey project : ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం అమలు చేస్తుంటే దానికయ్యే ఖర్ఛును సంబంధిత శాఖ భరిస్తుంది. కానీ గత ప్రభుత్వం సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ ద్వారా భూముల రీసర్వే చేపట్టగా , ఆ ప్రక్రియకు అయిన ఖర్చు మొత్తాన్ని సంబంధం లేని ఏపీఎండీసీ భరించింది. సర్వేరాళ్ల కొనుగోలు, పాలిషింగ్, రవాణాకు రూ.525 కోట్లను ఏపీఎండీసీ మంచినీళ్లులా వెచ్చించింది.