Five Super Sisters Secured Top Marks in Studies in Kurnool District : వారు ఐదుగురు అక్కాచెల్లెళ్లు, ఐదో పాపకు జన్మనిచ్చిన తల్లి అనారోగ్యంతో చనిపోయింది. తాగుబోతు తండ్రి. ఆడపిల్లలు అందులో పదేళ్లప్రాయం దాటని పసిపిల్లలని చూడకుండా తండ్రి వదిలేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో వారికి మేమున్నాం అంటూ అమ్మమ్మ, మేనమామలు వారిలో మనోధైర్యం నింపారు. పసిప్రాయంలో ఎదురైన విపత్కర పరిస్థితులే అక్కాచెల్లెళ్లలో పట్టుదల పెంచాయి. సరస్వతీ పుత్రికలు అన్న మాటకు నిదర్శనంగా చదువులో సత్తాచాటుతున్నారు. ఆ తోబుట్టువుల కథెంటో తెలుసుకోవాలంటే కర్నూలు వెళ్లాల్సిందే.