Chandrababu on India Brand : అంతర్జాతీయంగా ఇండియా బ్రాండ్ అత్యంత పటిష్టంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. పనిచేసే యువత ఉన్న దేశంగా భారత్కు స్వర్ణయుగం మొదలైందని అన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఇక నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టంచేశారు. దావోస్ వేదికగా భారత్ తరఫున నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్మోహన్నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు, తమిళనాడు, కేరళ మంత్రులతో కలిసి ఆయన మాట్లాడారు.