Ministers Nadendla and Anam Inaugurated Grain Procurement Center : రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరకు మించి రావాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రులు నాదెండ్ల మనోహర్, ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. 24 గంటల్లోపే ధాన్యం నగదు చెల్లింపులు ఉంటాయన్నారు. బస్తాకు ఐదు కేజీలకు మించి తరగు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించారు. అలాగే సంగం మండల కేంద్రంలో రూ. 20.50 లక్షలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం, గోదాములను ప్రారంభించారు.