Protest at Narasaraopet Private Hospital : ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వెళ్తే ఏకంగా ఆ చిన్నారి ప్రాణాలే పోయాయి. వైద్యం వికటించి ఆ బాలుడు మరణించాడు. మరోవైపు బాబు చనిపోయాడన్న విషయం తమకు చెప్పకుండా ట్రీట్మెంట్ పేరుతో తమ దగ్గర డబ్బులు వసూలు చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని వారు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో చోటుచేసుకుంది.