ఉడిపి స్వామీజీ అనుమానాస్పద మృతి
  • 6 years ago
దేశ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన ఉడిపిలోని అష్టమఠాలలో ఒక్కటి అయిన శీరూరు మఠాధిపతి శ్రీ లక్ష్మీవర తీర్థ స్వామీజీ (55) గురువారం అనుమానాస్పదస్థితిలో మరణించారు. మణిపాల్ లోని కేఎంసీ ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న శ్రీ లక్ష్మీవర తీర్థ స్వామీజీ మరణించడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో స్వామీజీ లాయర్ బాంబు పేల్చారు.ఉడిపిలోని శీరూరు మఠాధిపతి శ్రీ లక్ష్మీవర తీర్థ స్వామీజీ బుధవారం రాత్రి ఫుడ్ పాయిజ్ తో అనారోగ్యానికి గురైనారు. వెంటనే స్వామీజీని మణిపాల్ లోని కేఎంసీ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్ మీద స్వామీజీకి చికిత్స చేశారు. చికిత్స విఫలమై గురువారం శ్రీ లక్ష్మీవర తీర్థ స్వామీజీ మరణించారని వైద్యులు తెలిపారు.
Recommended