KCR Speech at BRS Public Meeting : ఇప్పటి నుంచి నేను బయటికి వస్తా.. అందరి తరఫున పోరాడుతానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. ఆనాడు, ఈనాడు, ఏనాడైనా తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీనేనని తీవ్రస్థాయిలో విమర్శించారు. 1956లో బలవంతంగా ఆంధ్రతో కలిపింది జవహర్లాల్ నెహ్రూనని, 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే నిరంకుశంగా అణిచివేసింది కాంగ్రెస్ పార్టీనేనని ధ్వజమెత్తారు. వరంగల్లోని ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.