Allu Aravind in Kims Hospital Secunderabad : సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించారు. అనంతరం ఆయన బాలుడి కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శ్రీతేజ్ హెల్త్ స్టేటస్పై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్రోడ్లో పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా ఫేమస్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ అనే బాలుడు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. గత 2 వారాలుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, అతడి ఆరోగ్యం కుదుటపడని విషయం విధితమే.