Many people Paid their Tribute to Lawyer Sunkara Rajendra Prasad Wife : ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న భౌతికకాయానికి పలువురు నివాళులర్పించారు. విజయవాడ సీతారాంపురంలోని నివాసంలో జ్యోత్స్న పార్థివదేహానికి బీవీ రాఘవులు సహా వామపక్షనేతలు, లాయర్లు నివాళులర్పించారు. పలు ఉద్యమాల్లో ఆమె కృషిని గుర్తుచేసుకున్నారు. అనంతరం మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి జ్యోత్స్న భౌతికకాయాన్ని తరలించారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఆ ఆస్పత్రికి అందజేయనున్నారు. అయితే రాజస్థాన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జ్యోత్స్న మృతిచెందిన విషయం తెలిసిందే.