Thyagaraja Music Festival 2025 : నిత్య విద్యార్థిగా ఉండడం వల్లే తాను సంగీత ప్రపంచంలో ఈ స్థాయికి చేరుకున్నానని ప్రసిద్ధ కర్ణాటక వాయులీన విద్వాంసులు, "నాదసుధార్ణవ" పద్మశ్రీ డాక్టర్ అన్నవరపు రామస్వామి అన్నారు. శిల్పారామంలో ఐదు రోజులుగా జరిగిన హైదరాబాద్ త్యాగరాజ ఆరాధన సంగీత ఉత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. సంగీతకారులు ఉదయాన్నే సంప్రదాయ పద్ధతిలో ఉంఛవృత్తి, నగర సంకీర్తనలని భక్తితో ఆచరించారు. సంస్కృతి ఫౌండేషన్ వారు డా.అన్నవరపు రామస్వామి గురుసన్మానంతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొని సంస్కృతి ఫౌండేషన్ తరపున గండపెండేరాన్ని బహూకరించారు.