Seismology Centers in AP : ఏపీ వ్యాప్తంగా భూకంప లేఖిని కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ భావిస్తోంది. ఇటీవల విజయవాడ, జగ్గయ్యపేట, ప్రకాశం జిల్లాలో వచ్చిన స్వల్ప ప్రకంపనల నేపథ్యంలో ఈ సెస్మోలజీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎక్కడో ఇండో-నేపాల్ సరిహద్దుల్లో భూకంపం వస్తే ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేట, విజయవాడల్లో ప్రకంపనలు వచ్చాయి. ఇక బంగాళాఖాతానికి ఆవల ఉన్న ఇండోనేషియా పరిసర ప్రాంతాల్లో భూమి ప్రకోపించినా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ ప్రకంపనలు వచ్చి భయపెడుతున్నాయి.