Next CS in AP : ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఏడాది జూన్ 7న సీఎస్గా బాధ్యతలు తీసుకున్న ఆయన పదవీకాలం ఆ నెలాఖరుతోనే ముగిసింది. 6 నెలల పాటు సీఎస్ పదవి కాలాన్ని పొడిగించాలని ఏపీ సర్కార్ కేంద్రాన్ని కోరడంతో ఆ మేర అనుమతులు వచ్చాయి. మరోసారి ఇంకో ఆరు నెలలు పొడిగించేందుకు అవకాశం ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం నుంచి ఆ దిశగా ప్రయత్నాలేమీ లేకపోవడంతో ఈ నెలాఖరుకు నీరభ్ కుమార్ పదవీ విరమణ చేయడం ఖరారైంది.