Lokesh on Visakha Data City : విశాఖ కేంద్రంగా డేటా సిటీని ఏర్పాటు చేస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇది ప్రపంచానికే తలమానికంగా రూపుదిద్దుకోనుందని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ను డిజిటల్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. డీప్ టెక్ సమ్మిట్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.