Unloading Ration Rice From Stella Ship has Begun at Kakinada Port : కాకినాడ తీరంలో నెలన్నరగా లంగరు వేసిన స్టెల్లా నౌకలోని రేషన్ బియ్యం దించే ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ గుర్తించిన 1320 టన్నుల బియ్యాన్ని శుక్రవారం కొంతమేర దించారు. పూర్తిగా అన్లోడ్ చేశాక ఎగుమతిదారుల ఆర్డర్ ప్రకారం వివిధ రకాల బియ్యాన్ని నింపి నౌకను గమ్యస్థానానికి పంపనున్నారు. మరోవైపు రేషన్ మాఫియా అక్రమాలు నిగ్గు తేల్చేందుకు నియమించిన సిట్ రావడంలో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది.