Stella Ship Case Updates : కాకినాడ తీరంలో నెల రోజులుగా లంగరు వేసిన స్టెల్లా షిప్ భవితవ్యం అలలపై ఊగిసలాటలా ఉంది. రేషన్ బియ్యం అక్రమ నిల్వలు ఇందులో ఉన్నాయని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ ప్రకటించినా, సీజ్ ద షిప్ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించినా చర్యల దిశగా మాత్రం అడుగులు పడలేదు. నౌక సీజ్ వ్యవహారం అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉంది దీంతో పాటు దేశాల మధ్య ఎగుమతి- దిగుమతుల సమస్య కావడంతో షిప్ను సీజ్ చేయడంకంటే అందులోని అక్రమ నిల్వలు సీజ్ చేయడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఈ నెల 15లోగా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.