REVENUE MEETINGS ACROSS AP: రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సదస్సులు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో నిర్వహిస్తున్న ఈ సదస్సులు జనవరి 8 వరకు జరగనున్నాయి. ప్రారంభ కార్యక్రమాల్లో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సులను సద్వినియోగం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని అనగాని పిలుపునిచ్చారు.