False Information in Auditing Kakinada SEZ : కాకినాడ పోర్టు, సెజ్లో వాటాలు గుంజుకున్న కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడ సీపోర్ట్పై ఆడిటింగ్ కోసం నియమించిన పీకేఎఫ్(PKF) శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ (LLP) సంస్థ వైఎస్సార్సీపీ ఎంవీ విజసాయిరెడ్డి నామినేయేనని సీఐడీ గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వానికి 965 కోట్లు ఎగవేశారంటూ తప్పుడు నివేదికలిచ్చిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం సంస్థ పోర్ట్ అరబిందోపరం కాగానే ఆ మొత్తాన్ని కేవలం రూ. 9 కోట్లకు తగ్గించేసింది.