Adani Bribe to YS Jagan : సెకితో చేసుకున్న విద్యుత్ ఒప్పందం జగన్ నిర్వాకంతో ఏపీకి గుదిబండలా మారింది. రాజస్థాన్లోని అదానీ ప్లాంట్ల నుంచి సౌరవిద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం పీఎస్ఏలు చేసుకుంది. ఫలితంగా రాజస్థాన్ భారీగా లాభపడుతోంది. ఆంధ్రప్రదేశ్కి తీవ్ర నష్టం జరుగుతోంది. పన్నులు, ప్రోత్సాహకాలతో కలిపి రాజస్థాన్కు రూ.11,000ల కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. పైగా 14,000ల మందికి ఉపాధి పాతికేళ్లలో రూ.8000ల కోట్ల లబ్ధితో పాటు 30 ఏళ్లపాటు ప్లాంట్ల ఏర్పాటు కోసం భూములిచ్చిన రైతులకు ఆదాయం సమకూరనుంది. జగన్ స్వార్థంతో వీటన్నిటిని ఆంధ్రప్రదేశ్ కోల్పోతోంది.