Ganesh Immersion in Hussain Sagar 2024 : వెళ్లి రావయ్యా గణపయ్య, మళ్లీ రావయ్య లంబోదరా అంటూ ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతిని భక్తులు గంగమ్మ ఒడికి సాగనంపారు. అశేష భక్తుల పూజలందుకున్న బడా గణేశుడి నిమజ్జనం, ఘనంగా పూర్తైంది. శోభయాత్ర ఆద్యంతం కనులవిందుగా సాగింది. మహాగణపతికి అడుగడుగునా భక్తులు నీరాజనం పలికారు. భారీ విజ్ఞాధిపతిని హుస్సేన్సాగర్లో నిజ్జమనం చేయడంతో మహాఘట్టం సంపూర్ణమైంది.