Shawarma Cases in Telangana : సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంటలోని గ్రిల్ హౌస్ అనే షాపులో షవర్మ తిని పలువురు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన చోటు చేసుకుంది. గత నెలలో ఇదే షాపులో షవర్మ తిన్న పలువురు ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పాటు ఆసుపత్రి పాలయ్యారు. దీంతో ఆహార భద్రత అధికారులు గ్రిల్హౌస్ షాప్ను తాత్కాలికంగా మూసివేయగా తిరిగి రెండు రోజుల క్రితం తెరిచి వ్యాపారాన్ని సాగిస్తున్నారు.