CM Chandrababu Review on Roads in AP : భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.186 కోట్లు విడుదల చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సచివాలయంలో రహదారులు భవనాల శాఖ పై సీఎం సమీక్ష నిర్వహించారు. రోడ్లపై గుంతలు పూడ్చే పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.