Sindhanur Road Accident Today : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సింధనూరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో తుఫాను వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనం డ్రైవర్ సహా నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను సింధనూరు ఆసుపత్రికి తరలించారు. మృతులు ఏపీకి చెందిన కర్నూలు జిల్లా వాసులుగా గుర్తించారు.