Three KG Gold Robbery Case : సంగారెడ్డి జిల్లాలో జులై 26న ట్రావెల్స్ బస్సులో చోరీకి గురైన మూడు కిలోల బంగారం కేసును జహీరాబాద్ పోలీసులు ఛేదించారు. రూ.2.10 కోట్ల విలువైన బంగారం అభరణాలను స్వాధీనం చేసుకోగా నిందితుడిని అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన ముఠానే చోరీకి పాల్పడిందని ఎస్పీ రూపేష్ వెల్లడించారు.