Chillakallu Gold Theft Case : అన్నం పెట్టిన ఇళ్లకే కన్నం వేస్తున్నారు కొందరు. యజమాని దగ్గర నమ్మకంగా ఉంటూ నట్టేట ముంచుతున్నారు. అదను చూసి అందిన కాడికి దోచుకుపోతున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద ఆరు కోట్ల విలువ చేసే బంగారం ఆభరణాలతో పరారైన డ్రైవర్ జిత్తు ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నందిగామ ఏసీపీ ఆధ్వర్యంలో సీఐ లచ్చినాయుడు విచారణ చేపట్టారు.