Chandrababu on Visakha Metro Rail Project: ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి వికేంద్రీకరణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాజధాని అమరావతికి పూర్వవైభవం తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సర్కార్ ఇప్పుడు విశాఖ అభివృద్ధిపై దృష్టి సారించింది. మెట్రో రైలు ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. డీపీఆర్లో కొన్ని మార్పులు చేసి ఎన్హెచ్ఏఐతో కలిసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది.