Sankranti Rush at Visakhapatnam Railway Station : సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విశాఖ రైల్వేస్టేషన్ కిటకిటలాడుతోంది. స్టేషన్కు వచ్చే సమయానికే రైళ్లన్నీ పూర్తిగా నిండిపోతుండడంతో ప్రజలు పట్టాలపైకి వచ్చి నిరీక్షిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ నుంచి పలాస వెళ్లే ప్యాసింజర్ రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోతున్నాయి. దీంతో రైలు రాకముందే ప్రయాణికులు పరుగులు తీసి రైళ్లు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా పరిస్థితిని చక్కదిద్దేందుకు RPF ప్రత్యేక బలగాలు ప్రయత్నిస్తున్నాయి.