Khammam JEE Ranker Navya Story : దేశంలోని ప్రతిష్ఠాత్మక కళాశాలల్లో ఇంజినీరింగ్ విద్య ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష జేఈఈ. లక్షలమంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు పోటీపడతారు. చాలామంది విద్యార్థులు ప్రత్యేక కోచింగ్ తీసుకుని మరీ కుస్తీ పడతారు. అయినా, సీటు సాధించేది కొద్దిమంది మాత్రమే. అలాంటి పోటీ పరీక్షల్లో ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా సత్తాచాటిందా అమ్మాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదివి, ఐఐటీ బాంబేలో సీటు సాధించిన గిరిజన విద్యార్థిని నవ్య చదువుల ప్రయాణం ఇది.