అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి విరుచుకుపడింది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలకు హైడ్రా నేలమట్టం చేసింది. పోలీసు బందోబస్తు మధ్య అక్కడి ఆక్రమణలను తొలగించారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి హైడ్రా ఈ కూల్చివేతలను చేపట్టింది.