Nimmakuru Gurukul Alumni Donates 3 Crores for New School Building : ఆ విద్యాలయం ఓ మహనీయుడు చేతుల మీదుగా పురుడు పోసుకుంది. తన సొంత ఊరిలో 8 ఎకరాల సొంత భూమిని విరాళంగా ఇచ్చి ఆ బడిని నిర్మించారు. అలా ఏర్పాటైన విద్యాలయంలో విద్యను అభ్యసించి ఎందరో ఉన్నతస్థానాలకు చేరుకున్నారు. అలాంటి ఆ బడి నేడు శిథిలావస్థకు చేరుకుంది. సరిపడా సౌకర్యాలు, ఉపాధ్యాయులు లేక పిల్లలు తగ్గిపోయారు. ఈ దీనస్థితని గమనించిన పూర్వవిద్యార్థులు మేమున్నామంటూ ముందుకు కదిలారు. తిరిగి విద్యాకుసుమాలు వికసించేలా తమ వంతు కృషి చేస్తున్నారు.