CM CHANDRABABU AT BOOK LAUNCH: కలుషిత ఆహారమే అనారోగ్యానికి కారణమని, రోగాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యతమ మనపైనే ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకోసమే రాష్ట్రంలో రానున్న 4 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించనున్నట్లు వెల్లడించారు. ప్రముఖ క్యాన్సర్ వైద్యులు నోరి దత్తాత్రేయుడు రచించిన మంటాడ టు మ్యాన్హ్యాటన్ పుస్తకాన్ని చంద్రబాబు విజయవాడలో ఆవిష్కరించారు.