TDP Leaders Fires on YS Jagan : వల్లభనేని వంశీపై కిడ్నాప్ కేసు అక్రమమంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేసిన విమర్శలకు టీడీపీ ఘాటుగా బదులిచ్చింది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారు సత్యవర్ధన్ను వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో సీసీటీవీ ఫుటేజ్ను విడుదల చేశారు. ఈ నెల 11న సత్యవర్ధన్ను వంశీ కిడ్నాప్ చేశారనడానికి ఈ దృశ్యాలే సాక్ష్యమన్నారు. ఓ కిడ్నాపర్ను జైలుకు వెళ్లి పరామర్శించిన జగన్ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని నేతలు ప్రశ్నించారు.