Arya Vaishya Corporation Chairman Doondi Rakesh Fire On YCP Leaders : వైఎస్సార్సీపీ పనైపోయిందని ఆ పార్టీ నుంచి తలపండిన నాయకులు సైతం బయటకు వెళ్లిపోతున్నారని ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేశ్ అన్నారు. ఏదో పార్టీలో వెళ్లేందుకు మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వంటివారు ప్రయత్నిస్తున్నారని, వారిని కూటమి పార్టీల్లో ఎవరూ చేర్చుకోరని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ విధ్యాధరపురంలో మీడియా సమావేశంలో మాట్లాడిన రాకేశ్, వైఎస్సార్సీపీ నేతలపై ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ పాలనలో దేవాలయాలపై దాడులు జరిగితే ఒక్కరినీ పట్టుకున్న పాపానపోలేదని ఆరోపించారు.