AP JAC Chairman Bopparaju Venkateswarlu : గత ప్రభుత్వం ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులు పెట్టిందని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గతంలో 10, 15 తేదీల్లో జీతాలు అందేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. గత ప్రభుత్వం మధ్యంతర భృతిని ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వమైనా మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. విజయవాడ రెవెన్యూ భవన్లో జరిగిన ఏపీ జేఏసీ అమరావతి సెక్రటేరియట్ సమావేశం అనంతరం మీడియాతో ఆ సంఘం ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ దామోదర్ మాట్లాడారు. ఉద్యోగులు అభిప్రాయాలతో కూడిన 18 అంశాలను సీఎం కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లామని ఆయన చెప్పారు.