TDP Pattabhi Ram Comments on YS Jagan: 2003లో 9 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన జగన్ ఇంతలోనే ఇన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించాడని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు. తండ్రి అధికారం, తన అధికారం అడ్డుపెట్టుకొని ప్రజా సంపదను దోచుకున్నదే కాని సక్రమ సంపాదన కాదని దుయ్యబట్టారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు జగన్ ముఠాలో తోడుదొంగలు కాదా అని నిలదీశారు. తాడేపల్లి ఇంటికి ఊడిగం చేసే ముఠాగా వీరంతా ఉన్నారని అన్నారు.