Shailaja Kiron Speech at Telugu Writers Mahasabhalu: తామంతా ఇంట్లో ఉదయం శుభోదయం అనే పలకరించుకునేవాళ్లమని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. తెలుగును భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అంతకుముందు వీరు తెలుగుతల్లి విగ్రహానికి వందనం సమర్పించారు.