Heated Discussion In Telangana Assembly : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. సభ కార్యకలాపాలపై సభ్యులకు సరిగ్గా సమాచారం ఇవ్వట్లేదంటూ విపక్షాలు అసహనం వ్యక్తం చేశాయి. శాసనసభ నడుపుతున్న తీరుపై విపక్షాలు తీవ్రంగా ఆక్షేపించాయి. సమాచారం లేకుండానే ఆర్థిక పరిస్థితిపై చర్చ పెట్టారని విమర్శించాయి. శాసనసభ రూల్స్ ప్రకారం సభ నిర్వహించాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు.