Party Change Leading To Political Heat in Telangana : ఎమ్మెల్యేల చేరికల అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోంది. 64 సీట్లతో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల ముంగిట ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.