CM Revanth Reddy On Telangana Talli Statue in Assembly : తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షాలు, విపక్షాల మధ్య వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. సభ ప్రారంభంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై మాట్లాడారు. ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం శాసనసభలో ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రాచుర్యంలో ఉన్న విగ్రహానికి అధికారిక గుర్తింపు లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగా తెలంగాణ తల్లి విగ్రహ ప్రత్యేకతలను సీఎం సభకు వివరించారు. స్వరాష్ట్ర సాధన సుదీర్ఘ పోరాటంలో సకల జనుల్లో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లిని అధికారికంగా గౌరవించుకుంటున్నామని చెప్పారు.