Save the Girl Child 2K Run: మగవారు మహిళల్లో తమ తల్లిని చూసినప్పుడే సమాజంలో ఆడవారిపై అఘాయిత్యాలు తగ్గుముఖం పడతాయని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మల కూడలిలో నిర్వహించిన సేవ్ ది గర్ల్ చైల్డ్ 2కే రన్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.