Gas To Every Home Through Pipeline : దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్ లాంటి మహా నగరాల్లోని గేటెడ్ కమ్యూనిటీలకే పరిమితమైన ఇంటింటికి పైప్ లైన్ల ద్వారా వంట గ్యాస్ సరఫరా ఇప్పుడు గుంటూరు జిల్లా వాసులకు అందుబాటులోకి రానుంది. మంత్రి నారా లోకేశ్ ఆలోచనలకు అనుగుణంగా మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఇంటింటికి గ్యాస్ అందించనున్నారు. మహిళల వంటింటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది.