YSRCP Govt Neglect on Guntur Channel Extension Works : వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన పాపాలు కూటమి ప్రభుత్వానికి గుదిబండగా మారుతున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులను విస్మరించడమే కాక కనీసం కాలువల విస్తరణనూ పట్టించుకోలేదు. గుంటూరు ఛానల్ పొడిగింపు పనులు సకాలంలో నిర్వహించని కారణంగా ఇప్పుడు అంచనాలు పెరిగి సర్కారుపై రూ.176 కోట్ల అదనపు భారం పడింది. గతంలో టీడీపీ మంజూరు చేసిన ప్రాజెక్టుని జగన్ విస్మరించడం వల్లే ఇప్పుడు ప్రజాధనం భారీగా వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.