దేశంలో ఉగ్రవాద సంఘటిత కదలికల నేపథ్యంలో జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని విజయవాడ రైల్వే స్టేషన్లో విస్తృత భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ రాహుల్దేవ్ సింగ్ ఆదేశాల మేరకు డీఎస్పీ రత్నరాజు పర్యవేక్షణలో ఈ తనిఖీలు జరిగాయి. జీఆర్పీ సీఐ జె.వి. రమణ ఆధ్వర్యంలో, ఆర్పీఎఫ్ అధికారుల సమన్వయంతో బలమైన భద్రతా చర్యలు తీసుకోబడ్డాయి.