Minister Partha Sarathy on Cabinet Decisions: కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకి వెల్లడించారు. దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మార్చేలా కొన్ని విధానాలకు ఆమోదం కేబినెట్ తెలిపిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఐటీ, గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలియజేసిందన్నారు. వర్కింగ్ స్పేస్, కో వర్కింగ్ స్పేస్, మానవ వనరుల అభివృద్ధికి ఈ విధానం తోడ్పడుతుందని, కో వర్కింగ్ స్పేస్లు అభివృద్ధి చేసే పెట్టుబడులకు ఈ పాలసీ తోడ్పాటు అందిస్తోందని చెప్పారు.