Central Government Plans to Merge Visakhapatnam Steel Plant with SAIL : ‘ఆంధ్రుల హక్కు ’గా ఖ్యాతి గాంచిన విశాఖ ఉక్కు పరిశ్రమకు ఊపిరి పోసేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విశాఖ ఉక్కును విలీనం చేసే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ప్లాంటు మనుగడకు ఇదే సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తుండటంతో సెయిల్లో విలీనం దాదాపు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.