AP Govt Key Changes in Tirumala : సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక మార్పులు చేపట్టింది. గత వైఎస్సార్సీపీ పాలనలో సాధారణ భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేలా తీసుకున్న నిర్ణయాలను సమీక్షించిన అధికారులు గణనీయమైన మార్పులు చేశారు. దర్శనాల సంఖ్య పెంచడంతో పాటు, సౌకర్యాలను మెరుగపరిచారు. ఫలితంగా ఒకే రోజు 85,000ల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకోగలుగుతున్నారు.