తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్ యూనివర్శిటీకి ఛైర్మన్గా ఆనంద్ మహీంద్రా నియమితులు కాబోతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి అమెరికాలోని ఓ సమావేశంలో ప్రకటించారు. మూడు రోజుల్లో ఆనంద్ మహీంద్రా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందన్నారు. తొలిసారి పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని, యువతకు వివిధ ట్రేడ్లలో స్కిల్స్ నేర్పించడంతో కోర్సు ముగిసిన వెంటనే ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు.